పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

చిత్రం
లుక్ష్మీ సమోసా కావలసిన పదార్థాలు:  గోధమపిండి రెండు కప్పులు,  అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను,  టొమాటో కెచప్, చిల్లీ సాస్ - రెండు టీ స్పూన్లు చొప్పున,  ఉల్లి తరుగు - అరకప్పు,  అల్లం, పచ్చిమిర్చి తరుగు ఒక టీ స్పూను చొప్పున,  జీరాపొడి,  కారం గరం మసాలా ఒక టీ స్పూను చొప్పున,  ఉప్పు - రుచికి,  కొత్తిమీర తరుగు గుప్పెడు.  నూనె - వేగించడానికి సరిపడా తయారుచే సే విధానం:  ఒక పాత్రలో గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, చిటికెడు ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో ముద్దగా కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఉల్లి, అల్లం పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీరా, పసుపు, గరం మసాలా, కారం పొడులు, కొత్తిమీర తరుగు వేసి వేగించాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను సమాన భాగాలుగా చేసి పూరీలుగా ఒత్తి టొమాటో కెచప్ చిల్లీ సాస్ పూసి, ఒక వైపున ఉల్లి మిశ్రమం పెట్టి, పూరీ మడిచి అంచులు వత్తాలి. తర్వాత పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా వేగించాలి. 

గుజరాతీ క్యాబేజీ

చిత్రం
గుజరాతీ క్యాబేజీ కావలసిన పదార్థాలు క్యారెట్, కొత్తిమీర తురుములు - పావు హండ్వా బియ్యం - ఒకటిన్నర కప్పు,  శనగపప్పు - అరకప్పు  మినప్పప్పు,  మసూరీదాల్,  కందిపప్పు, పెసరపప్పు - పావు కప్పు చొప్పున,  పెరుగు - అరకప్పు,  సొరకాయ కప్పు చొప్పున,  ఆల్లం, పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను,  పసుపు - చిటికెడు,  ఉప్పు - రుచికి,  ఇంగువ - చిటికెడు  మిరియాలపొడి - అర టీ స్పూను,  ఈనో పౌడర్ - ఒక ప్యాకెట్,  ఆవాలు నువ్వులు,  కరివేపాకు - తిరగమోతకు సరిపడా,  పంచదార - ఒక టీ స్పూను.  తయారుచేసే విధానం:  ఒక పాత్రలో బియ్యం, పప్పులు కలిపి 7 గంటలు నానబెట్టాలి. నీరు వడకట్టి, మిక్సీలో పెరుగుతో పాటు మెత్తగా రుబ్బి 6 గంటలు పక్కనుంచాలి. ఈ బ్యాటర్ లో కూరగాయల తురుములతో పాటు పసుపు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, పంచదార, మిరియాల పొడి వేసి ఈనో పౌడర్ కలపాలి. మూకుడులో నూనె వేసి ఆవాలు, నువ్వులు, కరివేపాకు తిరగమోత వేసి పిండిని పోసి పైన నువ్వులు చల్లాలి. రెండువైపులా దోరగా వేగిన తర్వాత ముక్కలుగా కోసి పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది

మీరే పారే

చిత్రం
 మీరే పారే కావలసినవి మైదా - 2 కప్పులు,  పంచదార - అర కప్పు  నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు,  నీళ్లు - కావాల్సినన్ని నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ:  ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు వేసుకుని పంచదార కరిగేవరకూ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి వేసుకుని ముద్దలా చేసుకోవాలి అవసరం అనిపిస్తే.. కలుపుకొనే సమయంలో కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని సుమారు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతీ ఉండల్లా చిన్న చిన్న ఉండలు చేసుకుని, చపాతీల్ల ఒత్తుకుని, ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది

మిల్క్ కేక్

చిత్రం
  మిల్క్ కేక్ కావలసినవి పాలు - అర లీటరు,  పంచదార - పావు కప్పు నిమ్మరసం - 1 టీ స్పూన్,  పిస్తా, బాదం తురుము - గుప్పెడు (అభిరుచిని బట్టి మరిన్ని తయారీ:  ముందుగా స్టన్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. కాసేపు తర్వాత నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. ఒకేసారి పోస్తే పాలు విరిగిపోతాయి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి, తర్వాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు అంగుళాలు లోతున్న బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి బాదం పిస్తా పలుకులు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేసుకుని, చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి

బియ్యం నీరు

చిత్రం
  బియ్యం నీరు అల్లం, మిరియాలు శరీరాన్ని వేడి చేసి కఫాన్ని కరిగించి, బయటకు వెళ్లగొడతాయి. రాతి ఉప్పు సొంతి వాత ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది కావలసిన పదార్థాలు బియ్యం - 10 గ్రాములు నీళ్లు - 200 మి.గ్రా అల్లం తరుగు - పావు చెంచా నల్ల మిరియాలు - 5 నువ్వుల నూనె - అర చెంచా సొంతి - అర చెంచా రాతి ఉప్పు - అర చెంచా తయారీ విధానం బియ్యం కడిగి, నానబెట్టుకోవాలి.మిరియాలు దంచుకోవాలి నువ్వుల నూనె వేడిచేసి, సొంఠి, అల్లం, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి నానబెట్టిన బియ్యాన్ని నీళ్లతో సహా వేయించిన మిశ్రమంలో పోయాలి. బియ్యం ఉడికేవరకూ కలిపి, చివర్లో రాతి ఉప్పు కలిపి పొయ్యి నుంచి దించాలి అలాగే రెండు నిమిషాలు పాత్రను కదపకుండా ఉంచాలి. ఈ నీటిని వడగట్టి తాగాలి

సూప్ మహ్రూమ్స్

చిత్రం
  సూప్ మ్రామ్స్ - 400 గ్రా,  ఉల్లికాడల తరుగు అరకప్పు,  వెజిటబుల్ స్టాక్ - 2 కప్పులు,  బటర్ - 3 టేబుల్ స్పూన్లు , కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూను,  పాలు కప్పు,  ఉప్పు,  మిరియాలపొడి - రుచికి తగినంత,  కొత్తిమీర త రుగు - అరకప్పు తయారుచేసే విధానం బటర్ మహ్రూమ్స్ ముక్కలు, ఉల్లికాడల తరుగు వేసి మెత్తబ డేవరకు వేగించాలి (మహ్రూమ్స్ నుండి నీరు ఊరుతుంది. ఆ నీటిని పారబోయకూడదు). ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మరికొద్ది సేపు మగ్గించి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముక్కల్ని మిక్సీలో పేస్టులా చేసుకుని వెజిటబుల్ స్టాక్ తో పాటు మరిగిం చాలి. తర్వాత పాలు, నీటిలో కరిగించిన కార్న్ ఫ్లోర్ కలపాలి. దించే ముందు కొత్తిమీర చల్లాలి. ఈ సూప్ బ్రెడ్ / పిజ్జాలతో సైడ్ డిష్గా సిప్ చేస్తే బాగుంటుంది

ముంచూర్ణియా

చిత్రం
  ముంచూర్ణియా కావలసిన పదార్థాలు మమ్రామ్స్ - 200 గ్రా,  మిరియాల పొడి - ఒక టీ స్పూను,  బి య్యప్పిండి, మైదా, కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్ల చొప్పున,  ఉప్పు - రుచికి తగినంత,  కారం - ఒక టీ స్పూను,  నీరు - అరకప్పు,  నూనె వేగించడానికి సరిపడా,  ఉల్లిపాయలు - 2,  వెల్లుల్లి రెబ్బలు - 4  సోయా సాస్ - 2 టీ స్పూన్లు,  పచ్చిమిర్చి - 4,  టమోటా సాస్ - ఒక టేబుల్ స్పూను,  టమోటా ప్యూరీ - 2 టేబుల్ స్పూన్లు,  కొత్తిమీర తరుగు - అలంకరణకు. తయారుచేసే విధానం ఒక బౌల్లో బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, మైదా, కారం, ఉప్పు (ఇష్టమైతే చిటికెడు ఆరంజ్ ఫడ్ కలర్) వేసి నీటితో జారుగా కలు పుకోవాలి. రెండు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్ ను జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు మరో కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లి తరుగు పొడుగా చీరిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. తర్వాత సోయా సాస్, టమోటా ప్యూరీ, సాస్ (ఇష్టమై తే ఆజినమోటో చిటికెడు) వేయాలి. రెండు నిమిషాల తర్వాత పక్కనుంచిన మహ్రూమ్స్ వేసి చిక్కబడేవరకూ ఉంచి కొత్తిమీ...